1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (18:36 IST)

పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో టీడీపీ సత్తా

ఏపీలో వెలువడుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగిరింది.

వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్వగ్రామాల్లో సైతం టీడీపీ జెండా ఎగరడం గమనార్హం. ఇప్పటికే సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇదే జరగ్గా.. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీటయ్యింది.
 
రాజధాని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత నియోజకవర్గంలో (తాడికొండ) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఫిరంగిపురం మండలంలో రెండు ఎంపీటీసీ స్థానాలుండగా.. ఈ రెండు చోట్లా టీడీపీ జెండా ఎగిరింది.

ఈ రెండు స్థానాలను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసుకున్నప్పటికీ ఏ మాత్రం వారి ప్రయత్నాలు ఫలించలేదు. గుండాలపాడులో 457 ఓట్లు, వేమవరం 93 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

కాగా.. రాజధాని నియోజకవర్గంలో రెండు స్దానాల ఓటమితో వైసీపీ డీలాపడినట్లయ్యింది. ఈ ఓటమితో వైసీపీ పెద్దల నుంచి శ్రీదేవికి పెద్ద ఎత్తున ఫోన్లు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.