గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (13:01 IST)

అప్పుడు 6 కేజీలు.. ఇప్పుడు 5.5 కేజీల మగ శిశువు జననం.. ఎక్కడ?

సాధారణంగా శిశువులు 3 నుంచి 4 కేజీల మధ్యలో జన్మిస్తూ ఉంటారు. గతంలో హైదరాబాద్ నగరంలోని నీలోఫర్‌ ఆసుపత్రిలో 6 కేజీల బరువుతో ఓ బాబు జన్మించాడు. తాజాగా భద్రాద్రిలో 5.5 కేజీల బాబు జన్మించడం రెండో రికార్డుగా నమోదైంది. కానీ భద్రాచలంలోని చర్చి రోడ్డులో ఉన్న జీవన్‌ వైద్యశాలలో ఓ చిన్నారి గురువారం 5.5 కేజీల బరువుతో సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంది.
 
వివరాల్లోకి వెళితే.. భద్రాచలంలోని చర్చి రోడ్డులో ఉన్న జీవన్‌ వైద్యశాలలో ఓ చిన్నారి గురువారం 5.5 కేజీల బరువుతో సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంది. ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన జట్టి సంధ్య కాన్పు కోసం జీవన్‌ వైద్యశాలలో చేరింది. అక్కడ ఆమెని పరీక్షించిన వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. 
 
కాగా ఆమె 5.5 కేజీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే గురువారం జన్మించిన ఈ శిశువు సాధారన బరువుకంటే ఎక్కువగా వుండటం గమనార్హం. మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మించిన సంధ్య, రెండో కాన్పులో బాబుకు జన్మనిచ్చింది.