ఏపీ సచివాలయ ప్రాంతంలో 144 సెక్షన్... సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక రాజధాని వెలగపూడి ప్రాంతంలో 144 సెక్షన్ విధించి.. సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ తాత్కాలిక రాజధాని నిర్మిస్తున్న వెలగపూడిలో ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ కార్మికుడు మంగళవారం కాంక్రీట్ మిషన్ పడి దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అతడి కుటుంబానికి న్యాయం చేయాలని తోటి కార్మికులు ఆందోళన చేపట్టారు. నిర్మాణ సంస్థకు చెందిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో వెలగపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో సచివాలయ నిర్మాణ పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆ ప్రాంతంలో బహిరంగ ప్రదర్శనలు, ఆందోళనలు, ధర్నాలు చేపట్టరాదని ఆదేశాలు జారీచేశారు. పైవేటు వ్యక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
దీంతో అధికారులు వారితో చర్చించి.. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడంతో వారు శాంతించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. సీఆర్డీఏ అధికారి జేసీ శ్రీధర్, పోలీసు ఉన్నతాధికారులు అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.