1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (08:55 IST)

చివరి రక్తపుబొట్టువరకు జగనన్న కోసం పని చేస్తా.. సత్తా ఏంటో చూపిస్తా : ఆర్కే.రోజా

rk roja
తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నగరి ప్రజల కోసం పని చేస్తానని, చివరి రక్తపుబొట్టువరకు జగనన్న కోసం పని చేస్తానని ఏపీ రాష్ట్ర పర్యాటక మంత్రి ఆర్.కె.రోజా అన్నారు. ఆమె మంత్రిగా నగరిలోని తన నివాసానికి తొలిసారి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఘన స్వాగతం లభించింది. నగరి నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రిగా తన సత్తా ఏమిటో చూపిస్తానని అన్నారు. ఇప్పటివరకు ఒక లెక్కని, ఇకపై మరో లెక్క అని పేర్కొన్నారు. తనకు కేటాయించిన పర్యాటకశాఖ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చడంపై దృష్టి సారిస్తానన్నారు.
 
తనకు ఇక సీటు రాదని, రోజా పని అయిపోయిందని ప్రచారం జరిగిందని, అలా ఎగతాళి చేసిన వారి నోళ్లు మూతపడేలా ఇక్కడి ప్రజలు తనను రెండుసార్లు గెలిపించారని అన్నారు. తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చారని, నగరి ప్రజలు తనకు రాజకీయ జన్మనిచ్చారని పేర్కొన్నారు. 
 
2024లోనూ వైపాకా అధికారంలోకి వస్తుందని, వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని రోజా ధీమా వ్యక్తం చేశారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకు నగరి ప్రజలకు సేవ చేస్తానని, చివరి రక్తపు బొట్టు వరకు జగనన్న కోసం పనిచేస్తానని రోజా పేర్కొన్నారు.