శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 10 జులై 2019 (13:12 IST)

రైలులో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

రైలులో ఓ గర్భిణీ ప్రసవించింది. ఈ సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లాలో జరిగింది. తమిళనాడు రాష్ట్రం తంజావూరుకి చెందిన ప్రవీణ నిండు గర్భిణీ. రామేశ్వరం నుంచి తిరుపతిలో ఉన్న పుట్టింటికి అమ్మ, అమ్మమ్మతో కలిసి రైలులో బయలుదేరింది. రైలు పాకాలకు సమీపంలోకి రాగానే ప్రవీణకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. 
 
బోగీలో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు పురుషులను పక్క బెర్తులోకి పంపి.. బోగీలోని కిటికీలను మూసివేసి.. ఎవరూ కనిపించకుండా చీరలు కట్టారు. పురిటి నొప్పులు వచ్చిన 15 నిమిషాల్లో ముంగిలిపట్టు వద్దకు రైలు చేరుకోగానే పండంటి మగబిడ్డను ప్రసవించింది. 
 
రైలు తిరుపతికి చేరుకునే లోపు 108కు సమాచారం అందించారు. 108 పైలెట్ చంద్రబాబు రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాంకు చేరుకుని రైల్వే పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో 108 వాహనంలోకి తీసుకెళ్లారు. స్టేషన్‌ సమీపంలో ఉన్న ప్రైవేటు వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి... అనంతరం ప్రసూతి ఆస్పత్రికి తరలించారు.