1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 31 మే 2019 (14:59 IST)

ముఖ్యమంత్రి జగన్ ఇంట్లో సెల్ఫీల సందడే.. సందడి

వై.ఎస్ జగన్ అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు సందడిగా మారింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా సాగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, జగన్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డి.ఎం.కె అధ్యక్షుడు స్టాలిన్ ఇలా పలువురు పాల్గొన్నారు. 
 
వై.ఎస్.ఆర్.సి.పి గౌరవ అధ్యక్షురాలు, జగన్ తల్లి విజయమ్మ గుండె ఉప్పొంగుతుండగా.. వేలాదిమంది ప్రత్యక్షంగా వీక్షిస్తుండగా గురువారం  మధ్యాహ్నం సరిగ్గా 12.23 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం కేసీఆర్‌తో పాటు స్టాలిన్ తదితర అతిథులకు జగన్ తన స్వగృహంలో విందు ఏర్పాటు చేశారు.
 
అతిథులు తిరిగి వెళ్లిపోయిన తరువాత జగన్ ఇల్లు సందడిసందడిగా మారింది. జగన్ తన కుటుంబ సభ్యులతో చాలా ఉల్లాసంగా గడిపారు. లండన్‌లో ఉంటున్న జగన్ కుమార్తెలు ఇద్దరూ ప్రమాణ స్వీకారానికి రావడం, షర్మిల-షర్మిల భర్త అనిల్, షర్మిల ఇద్దరు పిల్లలు ఇలా మరికొందరు కుటుంబ సభ్యులు అంతా ఒకచోట చేరి ఆనందగా గడిపారు. అందరూ కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చిన ఆనందకర మూమెంట్స్‌ను తమ కెమెరాలలో బంధించుకున్నారు. జగన్ మోహన్ రెడ్డికి దిష్టి తీస్తూ...