శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 8 డిశెంబరు 2016 (16:20 IST)

జియో దెబ్బ... ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్స్... రూ.145కే అపరిమిత వాయిస్ కాల్స్

రిలయన్స్ జియో దెబ్బకు భారతి ఎయిర్ టెల్ మెల్లమెల్లగా మెట్లు దిగుతోంది. జీవితకాలం ఉచిత వాయిస్ కాల్స్ కూడదంటూ వాదించిన ఎయిర్ టెల్ మెల్లిగా తన గొంతును సవరించుకుంటోంది. తాజాగా అది ప్రకటించిన ఆఫర్లు చూస్తే... రూ. 145 ప్యాక్‌తో 4జి డేటాతోపాటు ఉచిత లోకల్ మరి

రిలయన్స్ జియో దెబ్బకు భారతి ఎయిర్ టెల్ మెల్లమెల్లగా మెట్లు దిగుతోంది. జీవితకాలం ఉచిత వాయిస్ కాల్స్ కూడదంటూ వాదించిన ఎయిర్ టెల్ మెల్లిగా తన గొంతును సవరించుకుంటోంది. తాజాగా అది ప్రకటించిన ఆఫర్లు చూస్తే... రూ. 145 ప్యాక్‌తో 4జి డేటాతోపాటు ఉచిత లోకల్ మరియు ఎస్టీడి కాల్స్ అపరిమితం అని ప్రకటించింది. ఐతే 145 ప్యాకులో ఓ ట్విస్ట్ ఉంది. అదేమిటంటే... ఈ వాయిస్ కాల్స్ ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ మాత్రమే. ఇతర నెట్వర్కులకు మాట్లాడుకోవాలంటే రూ. 345 ప్యాక్ వేసుకోవాలి. 
 
ఈ ప్యాక్ ద్వారా ఇతర నెట్వర్కులకు అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. ఈ రెండు ప్యాక్స్ పరిధి 28 రోజుల వరకు మాత్రమే. ఈ సౌకర్యం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. కాగా రిలయన్స్ జియో ఉచిత వాయిస్ కాల్స్ ప్రకటనతో దేశంలో ఒక్కసారిగా ఆ నెట్వర్కుకు 5 కోట్లమంది వినియోగదారులుగా మారిపోయారు. ఇటీవలే కొత్త సంవత్సరం సందర్భంగా గడువును మరో మూడు నెలలు... అంటే మార్చి 31 వరకూ పెంచడంతో ఇతర నెట్వర్కులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి.