1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Festive Sweets Costlier As Prices Soar

Sweets Costlier: వినాయక చవితి.. పెరిగిన తీపి పదార్థాల ధరలు

Sweets
పది రోజుల పాటు జరిగే గణేశోత్సవాల్లో వినాయకుడికి నైవేద్యంగా సమర్పించే సంప్రదాయ పిండివంట 'మోదక్'తో పాటు ఇతర తీపి పదార్థాలు, చిరుతిళ్ల తయారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఎందుకంటే చక్కెర, బెల్లం వంటి నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. 
 
ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, పంట దిగుబడి క్షీణించడం, అలాగే ద్రవ్యోల్బణం కారణంగా నగరంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. చక్కెర, బియ్యం, పప్పులు, నూనె, ఉల్లిపాయలు, కూరగాయల ధరలు గణనీయంగా పెరగడంతో గృహస్థులపై, ముఖ్యంగా అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడింది. కిలో చక్కెర ధర రూ. 45 నుండి రూ. 65కి, బెల్లం ధర రూ. 55 నుండి రూ. 75కి పెరిగింది. 
 
నాణ్యతను బట్టి, గతంలో రూ. 50కి లభించిన సన్న బియ్యం ధర ఇప్పుడు కిలోకు రూ. 60 నుండి రూ. 70 మధ్య పలుకుతోంది. వంట నూనె ధర సగటున రూ. 6 పెరిగింది. గృహాల్లో నిత్యం వాడే అన్ని రకాల పప్పుల ధరలు కిలోకు రూ. 15 చొప్పున పెరిగాయి. రెండు వారాల క్రితం రూ. 125గా ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు రూ. 145కి చేరగా, మినపప్పు ధర రూ. 140గా ఉంది. కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. అనేక రకాలు కిలోకు రూ. 100 కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. 
 
గతంలో రూ. 100కు ఐదు కిలోల ఉల్లిపాయలు వచ్చేవి, కానీ ఇప్పుడు కేవలం రెండు కిలోలు మాత్రమే వస్తున్నాయని అట్టాపూర్‌కు చెందిన ఎస్. సంజీవ్ అన్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఇస్రో ప్రైవేటీకరణ కాదు.. ఎప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థనే : చైర్మన్ నారాయణన్