1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (11:25 IST)

పసిడి ధరలకు రెక్కలొచ్చాయి.. కారణం ఏంటంటే?

పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో భీతావహ పరిస్థితులు నెలకొన్న వేళ పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్వచ్ఛమైన బంగారం ధర ఎకాఎకిన 20 డాలర్లుకుపైగా పెరిగి 1924 డాలర్లు దాటింది. 
 
వెండిధర కూడా 1.3 శాతం పెరిగి 24.73 డాలర్లకు చేరుకుంది. ఫలితంగా హైదరాబాద్ బులియన్ ట్రేడింగులో గత రాత్రి 11.30 గంటల సమయానికి స్వచ్ఛమైన 24 కేరెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.53,100కు చేరుకోగా, వెండి కిలో ధర రూ.68,600గా ఉంది.
 
బుధవారం ఉదయం ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల రూ. 50,700గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 47 వేలుగా ఉంది. వెండి కిలో రూ. 65,600గా ఉండగా, ఒక్క రోజులోనే అనూహ్యంగా పెరిగిపోయాయి.