1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 27 మార్చి 2023 (22:44 IST)

TERI-IWA-UNDP వాటర్‌ సస్టెయినబిలిటీ అవార్డు గెలుచుకున్న అల్ట్రాటెక్ సిమెంట్

Teri
భారతదేశంలో అతిపెద్ద సిమెంట్‌, ఆర్‌ఎంసీ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్‌ లిమిటెడ్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన TERI-IWA-UNDP వాటర్‌ సస్టెయినబిలిటీ అవార్డు 2022ను ఎనర్జీ అండ్‌ రిసోర్స్‌ ఇనిస్టిట్యూట్‌ (TERI), ఇంటర్నేషనల్‌ వాటర్‌ అసోసియేషన్‌ (IWA), యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (UNDP ) సహకారంతో అంతర్జాతీయ నీటి దినోత్సవం 2023 సందర్భంగా అందజేసింది.
 
ఈ అవార్డును అల్ట్రాటెక్‌కు రెండవ వాటర్‌ సస్టెయినబిలిటీ అవార్డులు 2022-2023 వేడుకలో అందజేశారు. అల్ట్రాటెక్‌ను ‘వాటర్‌ ఫర్‌ ఆల్‌’ విభాగం కింద గుర్తించారు. అల్ట్రాటెక్‌ యొక్క ఇంటిగ్రేటెడ్‌ సిమెంట్‌ తయారీ యూనిట్‌ ఆంధ్రప్రదేశ్‌ సిమెంట్‌ వర్క్స్‌ తమ యూనిట్‌కు దగ్గరలోని రెండు గ్రామాలలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌ కోసం ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిటీ నీటి నిర్మాణాలను కాపాడటంతో పాటుగా పునరుద్ధరించడాన్ని, స్థానిక ప్రజల జీవితాలు, జీవనోపాధి వృద్ధి చేయడం లక్ష్యంగా చేసుకున్నారు.
 
వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా జీవనోపాధి మెరుగుపరచడం
పాక్షిక, తీవ్ర కరువు ప్రాంతాలున్నటివంటి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో నీటి కొరత సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రి వద్దనున్న ఆంధ్రప్రదేశ్‌ సిమెంట్‌ వర్క్స్‌ (ఏపీసీడబ్ల్యు),  అయ్యవారిపల్లి (అనంతపూర్‌ జిల్లా), పెట్నికోట (నందాల్య జిల్లా) గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో దత్తత తీసుకోవడంతో పాటుగా ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌ అమలు చేసింది. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సంవత్సరానికి 30% చొప్పున అడుగంటిపోతున్నాయి. ఈ యూనిట్‌ ఇంటర్నేషనల్‌ క్రాప్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ద సెమి-అరిడ్‌ ట్రోపిక్స్‌ (ఇక్రిశాట్‌)తో భాగస్వామ్యం చేసుకుని ఈ ప్రాజెక్ట్‌ అమలు చేయడంతో పాటుగా నీటి కొరత, భూసార క్షీణత, తక్కువ పంట దిగుబడి సమస్యలను పరిష్కరించడం ద్వారా గ్రామస్తుల ఆదాయ స్థాయి, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.
 
కొలిమిగుండ్ల మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంతో పాటుగా తాడిపత్రి మండలంలోని పెట్నికోట గ్రామంలో ఏడు వాటర్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణాలను చేయడం ద్వారా భూగర్భ జలాల స్థాయిలను మెరుగుపరచడంతో పాటుగా సంవత్సరమంతా నీటి లభ్యతకు భరోసా అందించారు. రైతులకు మెరుగైన వ్యవసాయ పద్ధతుల పట్ల శిక్షణ అందించడంతో పాటుగా ఆదాయ సృష్టి కార్యక్రమాలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. భూ వినియోగం కోసం అత్యుత్తమ ప్రక్రియలను గురించి ప్రదర్శనలను చేయడంతో పాటుగా పంట దిగుబడి పెంచేందుకు పంట నిర్వహణ గురించి కూడా వెల్లడించారు.
 
అధిక దిగుబడి అందించే పంట విత్తనాలను ఇక్రిశాట్‌ అభివృద్ధి చేయడంతో పాటుగా 250-280 ఎకరాల వ్యవసాయ భూమిలో రైతులు వినియోగించేందుకు పంపిణీ చేసింది. ఈ రెండు గ్రామాలలో రైతులకు భూసార పరీక్షలకు సంబంధించి సాయిల్‌ హెల్త్‌ కార్డ్‌లను సైతం పంపిణీ చేశారు. భూసార పరిస్థితులను బట్టి ఎరువులు, పురుగుమందుల వినియోగం పట్ల రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కారణం చేత ఎరువులు, పురుగు మందుల వినియోగం గణనీయంగా తగ్గింది. తద్వారా సాగు ఖర్చు కూడా గణనీయంగా తగ్గింది. ఇళ్లకు కిచెన్‌ గార్డెన్‌ విత్తనాలు సైతం పంపిణీ చేయడంతో పాటుగా అదనపు ఆదాయం పొందడం కోసం స్ధానిక మహిళలను ప్రోత్సహిస్తున్నారు.
 
ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌ ప్రభావం
ఆంధ్రప్రదేశ్‌ సిమెంట్‌ వర్క్స్‌ ప్రాజెక్ట్‌ ద్వారా 500 కుటుంబాలకు చెందిన దాదాపు 2 వేల మంది ప్రజలు ఈ రెండు గ్రామాలలో లబ్ధి పొందుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ పలుమార్లు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల గ్రామస్తులకు ఆదాయాన్ని పెంచుకునే బహుళ ప్రయోజనాలను అందించింది.
 
నీటి లభ్యత మెరుగుపడింది
 
పెట్నికోట, అయ్యవారి పల్లి గ్రామాలలో రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణాలు (ఇంకుడు గుంతలు) వల్ల నీటి నిల్వ సామర్ధ్యం దాదాపుగా 35వేల క్యూబిక్‌ మీటర్లు  సృష్టించబడింది.
 
జనవరి 2023 నాటికి ఈ ఇంకుడు గుంతల కారణంగా దాదాపు 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీరు సేకరించబడ్డాయి.
 
వాటర్‌షెడ్‌ ఏరియాలలో భూగర్భ జలాలు 2-4 మీటర్ల పైకి ఈ ఇంకుడు గుంతల కారణంగా వచ్చాయి.
 
400 ఎకరాల బంజరుభూమి ఈ గ్రామాలలో వాటర్‌షెడ్‌ నిర్మాణాల వల్ల సాగులోకి వచ్చింది.
 
పంట దిగుబడి పెరిగింది :
అత్యధిక దిగుబడి రకపు విత్తనాలు సాగు చేయడం వల్ల పంట దిగుబడి పరంగా 30-40% వృద్ధి కనిపించింది.
 
వర్షపు నీటి నిల్వలతో భూగర్భ జలాలు పెరగడంతో పాటుగా ఈ రెండు గ్రామాలలో దాదాపు 346 హెక్టార్ల భూమి సాగులోకి వచ్చింది.
 
దాదాపుగా 115 హెక్టార్ల భూమిలో మూడు పంటలను పండించడం రైతులు ప్రారంభించారు. తృణధాన్యాలు లేదా స్వల్పకాలంలో పంటకు వచ్చే కూరగాయలను వర్షాకాలం అనంతరం సాగు చేయడం ద్వారా తమ ఆదాయం పెంచుకున్నారు.
 
కిచెన్‌ ఫార్మ్‌ ఉత్పత్తుల ద్వారా నెలకు 2500 రూపాయల నుంచి 3000 రూపాయలను మహిళలు సంపాదించగలుగుతున్నారు.