1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. A big shock for Jio customers, the telecom company has increased the recharge plan

వినియోగదారులకు షాకిచ్చిన రిలయన్స్ జియో...

jio reliance
వినియోగదారులకు రిలయన్స్ జియో తేరుకోలేని షాకిచ్చింది. తాజాగా 199 రీచార్జ్ ప్లాన్‌పై ఏకంగా రూ.100 పంచేసింది. ఇప్పటికే దేశంలోని ఎయిర్‌టెల్, ఇండియా టెలికాం కంపెనీలపై ఆధిపత్యం చెలాయిస్తున్న రిలయన్స్ జియో కంపెనీ.. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు షాకిచ్చింది. ఇందులోభాగంగా తన రూ.199 ప్లాన్ ధరపై ఏకంగా రూ.100 పెంచేసింది. అయితే, ఇపుడు ఈ ప్లాన్‌లో మునుపటి కంటే కొంచెం ఎక్కువ డేటా అందుబాటులో ఉంటుంది. జియో తన పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను రూ.299కి తగ్గించింది. అయితే, ఇతర కంపెనీలతో పోల్చితే ఈ ధర చౌకగా ఉందన్నారు. 
 
అయితే రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్ పొందాలంటే ఖచ్చితంగా రూ.299 చెల్లించాల్సి వుంటుంది. ఈ ధర పెంపునకు ముందు వినియోగదారులు రూ.199 ప్లాన్‌లో 25 జీబీ డేటాను పొందేవారు. కానీ, ఇపుడు రూ.299 చెల్లిస్తే 30 జీబీ డేటా లభిస్తుంది. 30 డేటా ముగిసిన తర్వాత ప్రతి ఒక్క జీబీకి రూ.10 చొప్పున చెల్లించాల్సిఉంటుంది. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో కొనుగోలుదారులు వంద ఉచిత ఎస్ఎంఎస్‌లను పొందుతారు. దీంతో పాటు అన్ లిమిటెడ్ టాక్ టైం కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌ను తీసుకోవడం ద్వారా కస్టమర్లు, జియోటీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రాహుల్ గాంధీపై అనర్హత వేటు - తీర్పు తర్వాత లోక్‌సభకు...