1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (10:23 IST)

జూన్ 28న కరోనా పాజిటివ్ కేసులెన్ని?

దేశంలో కరోనా వైరస్ పాజటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గత 24 గంటల్లో 46,148 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఆ ప్రకారంగా 24 గంట‌ల్లో 58,578 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,79,331కు చేరింది.
 
ఇక మరణాల విషయానికొస్తే నిన్న‌ 689 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,96,730కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,93,09,607 మంది కోలుకున్నారు.
 
మరో 5,72,994 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో రిక‌వ‌రీ రేటు 96.80 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 32,36,63,297 డోసుల వ్యాక్సిన్లు వేశారు. 
 
కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వశాఖ విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం గ‌డ‌చిన 24 గంట‌ల్లో 689 మంది క‌రోనాతో మృతి చెందారు. గత 81 రోజుల్లో ఇదే అత్యల్పం. దీనికిముందు ఏప్రిల్ 7న 685 మంది కరోనా కార‌ణంగా క‌న్నుమూశారు. 
 
దేశంలో ఏప్రిల్ 12 తర్వాత మొదటిసారిగా జూన్ 27 న కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా మరణించిన వారి సంఖ్య వెయ్యి కన్నా తక్కువగా నమోదైంది. గత వారంలో కరోనా కారణంగా సంభ‌వించిన మరణాలలో 45 శాతం క్షీణత క‌నిపించింది.