మీ ఆట తీరుతో ఎంతమంది మెంటల్ హెల్త్ పాడవుతుంది.. పాక్ యువతి (Video)
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టును భారత్ చిత్తుగా ఓడించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు 241 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత స్టార్ హీరో విరాట్ కోహ్లి సెంచరీతో భారత్ గెలుపును సులభంగా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు ఓడిపోవడాన్ని ఆ దేశ క్రికెట్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు.
ఇదే విషయంపై పాకిస్థాన్కు చెందిన ఓ యువతి తమ ఆటగాళ్ల ఆటతీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి ఇపుడు వైరల్ అయింది. "మా జట్టుకు ఏమైందో అర్థం కావడం లేదు. ఈ మ్యాచ్ వల్ల ఎంతో మంది మెంటల్ హెల్త్ పాడవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లేయర్లు ఆడాలి కదా? బ్యాటింగ్, ఫీల్డింగ్ బాగా చేసేందుకు ప్రాక్టీస్ చేయండి. ఎందుకు మమ్మల్ని పదేపదే నిరుత్సాహపరుస్తున్నారు? అంటూ ఆమె ఘాటుగా ప్రశ్నించింది.