సంబంధిత వార్తలు
- బీసీసీఐ కీలక నిర్ణయం.. ప్రేక్షక్షులు లేకుండా మ్యాచ్లు.. ఆ టోర్నీలు రద్దు?
- భజ్జీ దంపతులు గుడ్ న్యూస్ చెప్పారోచ్.. ఏంటందో తెలుసా?
- కడక్నాథ్ కోడి గురించే వెతికేస్తున్నారు.. అంతా ధోనీ మాయ!
- పాక్ కండకావరం.. టోర్నీ నుంచి నిష్క్రమించేందుకే అలాంటి మాటలు..?
- మొతేరాలో అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు... 10 వికెట్ల తేడాతో భారత్ గెలుపు
భారత వన్డే జట్టులో సూర్య - ప్రకటించిన బీసీసీఐ
ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఇప్పటికే టెస్టు సిరీస్ పూర్తి చేసి ట్వంటీ20 సిరీస్ను ఆడుతోంది. ఈ సిరీస్లోని చివరి మ్యాచ్ 20వ తేదీన జరుగనుంది. అయితే, ఇంగ్లండ్తో త్వరలో జరగనున్న వన్డే సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ఈ రోజు ప్రకటించింది.
ఈ జట్టులో సూర్యకుమార్ యాదవ్, క్రునాల్ పాండ్యాకు చోటుదక్కింది. టీమిండియా స్క్వాడ్లో విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర ఛాహెల్, కుల్దీప్ యాదవ్, క్రునాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఎండీ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ ఉన్నారు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆ మూడు మ్యాచులు పూణెలోనే జరగనున్నాయి. మొదటి వన్డే ఈ నెల 23న, రెండో వన్డే 26న, మూడో వన్డే 28న జరుగుతుంది. కాగా, టెస్టు సిరీస్లో విజయం సాధించిన టీమిండియా ప్రస్తుతం జరుగుతోన్న టీ20ల్లోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లో ఇరు జట్లూ 2-2 తేడాతో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. నిర్ణయాత్మక ఐదో టీ20పై ఉత్కంఠ నెలకొంది. నాలుగో టీ20 మ్యాచులో సూర్యకుమార్ అద్భుతంగా రాణించడంతో వన్డే సిరీస్లో చోటుదక్కింది.
