సంబంధిత వార్తలు
- బంగ్లాదేశ్లో టీమిండియా వైట్ బాల్ టూర్ ... ఆగస్టు నుంచి ప్రారంభం
- ఐపీఎల్ 2025: 200 క్యాచ్లతో పాటు వికెట్లు.. ధోనీ ఖాతాలో ఆ రికార్డ్
- ప్రాక్టీస్ సెషన్ జరుగుతుండగా వాతావరణంలో మార్పులు.. రోహిత్ శర్మ వీడియో వైరల్
- ఐపీఎల్ చరిత్రలో 1,000 బౌండరీలు - అరుదైన రికార్డుకు చేరువలో కింగ్ కోహ్లీ
- విరాట్ కోహ్లీ హోటళ్లో సీఎస్కే జెర్సీ ధరించిన ధోనీ ఫ్యాన్.. కింగ్ కోహ్లీ ఏమన్నాడో తెలుసా? (video)
రోహిత్ శర్మకు అరుదైన గౌరవం: వాంఖడేలోని ఒక స్టాండ్కు హిట్ మ్యాన్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్కు అతని పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ కీలక నిర్ణయాన్ని ఎంసీఏ ప్రతినిధులు మంగళవారం మీడియాకు ప్రకటించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య రోహిత్ శర్మ పెవిలియన్ ఆవిష్కరణ జరిగే అవకాశం ఉంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ వార్షిక సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా స్టేడియం స్టాండ్లకు క్రికెట్ దిగ్గజాల పేరు పెట్టాలనే ప్రతిపాదనపై అధికారులు చర్చించారు.
భారత క్రికెట్ కు, ముఖ్యంగా ముంబై క్రికెట్కు గణనీయమైన సేవలందించిన రోహిత్ శర్మ ఈ గుర్తింపుకు అర్హుడని సభ్యులందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఫలితంగా, వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్కు అతని పేరు పెట్టాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం వివరాలను ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ వెల్లడించారు.
తర్వాతి కథనం
