1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 19 జులై 2023 (23:20 IST)

ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్, సోషల్ మీడియాలో వీడియో

Mob
మణిపూర్‌లో దారుణ సంఘటన వెలుగుచూసింది. కొందరు మగాళ్ల గుంపు ఇద్దరు మహిళలను రోడ్డుపై నగ్నంగా ఊరేగించిన భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది. రోడ్డుపై ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ, వారి ప్రైవేట్ భాగాలపై చేతులు వేస్తూ వారిని పొలంలోకి తరలించుకెళ్లారు. అక్కడ ఆ మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిందని ఓ గిరిజన సంస్థ ఆరోపించింది. ఈ సంఘటన మే 4న రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిందని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ ఒక ప్రకటనలో తెలిపింది.
 
ఈ దారుణ ఘటనకి ముందురోజు షెడ్యూల్డ్ తెగల హోదా కోసం మెయిటీస్ డిమాండ్‌పై మణిపూర్‌లోని లోయ-మెజారిటీ మెయిటీ, కొండ-మెజారిటీ కుకీ తెగ మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆ మహిళలపై దారుణం జరిగినట్లు అనుమానిస్తున్నారు. కాగా నిందితులపై సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదు చేసినట్లు మణిపూర్ పోలీసులు ఈరోజు ట్వీట్ చేశారు.
 
"మే 4న ఇద్దరు మహిళలను గుర్తుతెలియని సాయుధ దుండగులు నగ్నంగా ఊరేగించిన వీడియోలకు సంబంధించి, నాంగ్‌పోక్ సెక్మై పోలీస్ స్టేషన్లో అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభమైంది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు.