సంబంధిత వార్తలు
- బీమా సొమ్ము కోసం సెలైన్లో విషం కలిపి హత్య చేసిన భార్య
- కాశీలో రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?
- సినీ ఫక్కీలో రియల్ లైఫ్ జరిగింది.. విడాకులు పేపర్లు చించేసి భర్తను హత్తుకుంది.. (video)
- పిల్లలకు బిర్యానీ పెట్టి.. నీళ్లల్లో ముంచి చంపేశాడు.. ఆపై అతను కూడా?
- తరచూ పుట్టింటికి వెళ్తుందనే అసహనం.. భార్యను చంపేసిన భర్త
వైమానిక దళ అధికారి భార్యపై అత్యాచారానికి పాల్పడిన పాత స్నేహితులు... ఎక్కడ?
మహారాష్ట్రలోని నాగ్పూర్లో అత్యంత హేయమైన, దారుణ ఘటన ఒకటి జరిగింది. వైమానిక దళ అధికారి భార్యపై పాత స్నేహితులు అత్యాచారానికి తెగబడ్డారు. శీతల పానీయంతో మత్తుమందు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలను వసూలు చేశారు. అంతేకాకుండా ఆమెతో బలవంతంగా మతమార్పిడి కూడా చేయించి, నిఖా చేయించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులపై పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
పోలీసులు కథనం ప్రకారం.. భూమి లావాదేవీల విషయమై ఫిబ్రవరి 2025లో తన పాత స్కూల్ పరిచయస్తుడు అయ్యాజ్ తాజ్ మదారేను 24 యేళ్ళ బాధితురాలైన వైమానికదళ సతీమణి కలిసింది. వీరిద్దరూ ఫిబ్రవరి 8న ఒక హోటల్ సమావేశమయ్యారు. ఆ సమయంలో అయ్యాజ్ ఆమెకు ఇచ్చిన పానీయంలో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసి, వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ గత కొన్ని నెలలుగా ఆమె నుంచి దాదాపు రూ.4 లక్షలు వసూలు చేశాడు. అంతేకాకుండా, చేతబడి (బ్లాక్ మ్యాజిక్) చేస్తామంటూ పలుమార్లు బెదిరింపులకు గురిచేశారు.
మే 31వ తేదీన నిందితుడు అయ్యాజ్, అతడి అనుచరుడు అమీన్ షేక్ కలిసి ఆ యువతిని కల్మేశ్వర్ ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ హజ్రత్ మౌలానా అనే మత పెద్ద ఆమె చేత బలవంతంగా మతమార్పిడి ఆచారాలు చేయించి, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అయ్యాజ్తో నిఖా జరిపించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. నగరం వెలుపల విధులు నిర్వహిస్తున్న ఆమె భర్త వైమానిక అధికారి ఈ ఘోరం గురించి తెలుసుకుని, జూన్ 14న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగ్పూర్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
తర్వాతి కథనం
