1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (18:43 IST)

నూజివీడులో ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విషాద ఘటన జరిగింది. ఇక్కడ చేరిన మొదటి సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
నూజివీడు ట్రిపుల్ ఐటీ మొదటి సంవత్సరం చదువుతున్న రాములు నాయక్ అనే విద్యార్థి తన ఉండే హాస్టల్ గదిలోనే ఉరేసుకున్నాడు. మృతుని స్వస్థలం విజయనగరం జిల్లా గుర్ల మండలం. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. అలాగే, హాస్టల్ విద్యార్థుల వద్ద రాములు మానసికపరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.