1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Humans have shorter attention span than goldfish

టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్‌ పుణ్యం.. మనిషి ఏకాగ్రత గోల్డ్‌ఫిష్ కంటే?

టెక్నాలజీ పుణ్యంతో మనిషిలో ఏకాగ్రత కొరవడింది. తాజాగా ఓ అధ్యయనంలో మనిషి అటెన్షన్ గోల్డ్‌ఫిష్ కంటే తక్కువేనని తేలింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ప్రస్తుతం జనం ముందుకు కదలట్లేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా

Humans
టెక్నాలజీ పుణ్యంతో మనిషిలో ఏకాగ్రత కొరవడింది. తాజాగా ఓ అధ్యయనంలో మనిషి అటెన్షన్ గోల్డ్‌ఫిష్ కంటే తక్కువేనని తేలింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ప్రస్తుతం జనం ముందుకు కదలట్లేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా దశాబ్దం క్రితం 12 సెకండ్లు ఉన్న అటెన్షన్ స్పాన్ క్రమంగా 8 సెకండ్లకు తగ్గిపోయింది.


ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే మానవుని అటెన్షన్ గోల్డ్‌ఫిష్ కన్నా తక్కువేనట. స్మార్ట్‌ఫోన్స్, టెక్నాలజీ వినియోగం పెరిగాక మానవుని అటెన్షన్ 12 నుంచి 8 సెకన్లకు పడిపోయింది. అయితే గోల్డ్‌ఫిష్ అటెన్షన్ విషయానికొస్తే 9 సెకండ్లుగా ఉంది. 
 
ఈ అధ్యయాన్ని మైక్రోసాప్ట్ కార్పోరేషన్ నిర్వహించింది. రోజు వారి జీవితంలో డిజిటల్ మీడియా సులభంగా అందుబాటులో వుండేవారిలో ఏకాగ్రత బాగా తగ్గిపోయిందని వెల్లడి అయ్యింది. అధ్యయనం ప్రకారం మానవుని అటెన్షన్ సమయం సరాసరి 12 సెకండ్ల నుంచి 8 సెకండ్ల పడిపోయింది.

2000 సంవత్సరం నుంచి ఇది క్రమంగా పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం మనిషి అటెన్షన్ స్పాన్ గోల్డ్‌ఫిష్ కన్నా తక్కువగా ఉంది. ఈ తిరోగమనం అన్ని ఏజ్ గ్రూప్‌ల వారిలోనూ కనిపించిందని అధ్యయనకారులు తెలిపారు.
About Writer
kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
రుతుక్రమ సమస్యలను తొలగించే అంజీర..