శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (21:33 IST)

పాలు, పెరుగు రోజూ తీసుకుంటే.. మెదడుకు అంత మేలా?

పాలు, పెరుగు రోజూవారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు లేవని వైద్యులు చెప్తున్నారు. అందుకే రోజూ పెరుగు, పాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజుకు మూడు గ్లాసుల పాలు, రెండు కప్పుల పెరుగు తప్పక తీసుకోవాలి. 
 
మనం తినే ఆహారంలో భాగంగా పాలు, పెరుగు, జున్ను, పండ్లు బాగా తీసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు తగ్గుతుందని వైద్యులు చెప్తున్నారు. ఫైబర్‌ అత్యధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు తిన్నా మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తవు. 
 
ఆవు పాలు, జున్ను, పెరుగు, వెన్న లాంటి ఉత్పత్తుల్లో అధిక మొత్తంలో పోషకాలు, కాల్షియం, ప్రోటీన్‌లు లభిస్తాయి. ఎదుగుతున్న పిల్లలు పాలు తాగడం వల్ల ఎముకలు పొడువుగా, మందంగా పెరిగి గట్టిపడతాయి. ఆర్యోగంగా ఉంటారు. బాలింతలు పాలను తీసుకోవడం వల్ల వారి ఎముకల నుంచి పోయిన కాల్షియం తిరిగి చేరుతుంది. నడుం నొప్పి తగ్గుతుంది. మహిళలు మెనోపాజ్‌ దశలో పాలు తాగడం చాలా ముఖ్యం.
 
అలాగే పాలే కాదు పాల ఉత్పత్తులైన పనీర్‌ చీజ్‌, పెరుగు, మజ్జిగ ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పెరుగు, మజ్జిగల్లో మంచి బ్యాక్టీరియా శరీరాన్ని అరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి ఆరోగ్యానికి మరింత మంచిది. ఇంకా మెదడుకు కూడా మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.