1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Dos and Don'ts after Meals for Healthy Living

భోజనం చేశాక ఇలా చేయొద్దు...

చాలా మంది భోజనం చేశాక టీలు సేవించడం, పండ్లు పుష్టిగా ఆరగించడం, స్నానం చేయడం వంటివి చేస్తుంటారు. నిజానికి భోజనం చేసిన తర్వాత ఓ గంట పాటు ఎలాంటి ఆహారం లేదా చిరు తిండ్లను తీసుకోరాదు. అలా చేయడం ఆరోగ్యానికి

Meals
చాలా మంది భోజనం చేశాక టీలు సేవించడం, పండ్లు పుష్టిగా ఆరగించడం, స్నానం చేయడం వంటివి చేస్తుంటారు. నిజానికి భోజనం చేసిన తర్వాత ఓ గంట పాటు ఎలాంటి ఆహారం లేదా చిరు తిండ్లను తీసుకోరాదు. అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భోజనం తర్వాత ఏమేమి చేయకూడదో ఓ సారి తెలుసుకుందాం.
 
* చాలా మంది భోజనం చేసిన వెంటనే నిద్రపోయేందుకు పడకెక్కుతారు. నిజానికి తినగానే వెంటనే పక్కమీదకు చేరొద్దు. అలా నిద్రలోకి జారుకుంటే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి. 
 
* కొందరికి భోజనం చేయగానే స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల కాళ్లు, చేతుల్లోకి రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి జీర్ణవ్యవస్థ పనితీరు మందగించే ప్రమాదం ఉంది.
 
* భోజనం చేసేముందు కానీ, చేశాక కానీ వివిధ రకాల పండ్లు ఆరగించరాదు. ఇలా చేయడం వల్ల పొట్ట పెరుగుతుంది. రెండింటికీ మధ్య రెండు మూడు గంటల వ్యవధి ఉండాలి.
 
* అన్నం తిన్న తర్వాత టీ తాగితే భోజనం జీర్ణంకాదు. తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆయనకేమో ముఖ రతి ఇష్టం.. నాకేమో అయిష్టం.. ఏం చేయాలి?