శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్
శీతాకాలంలో ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, అలసట వంటి సమస్యలు మనల్ని వేధిస్తాయి. దీన్ని ఎదుర్కోవడానికి అందుబాటులో వుండే చిట్కాలను అనుసరిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము.
యాంటీబయాటిక్ లక్షణాలున్న పసుపును చిటికెడు గోరువెచ్చని పాలలో కలిపి తాగితే గొంతు నొప్పి, జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది.
వేడి నీటిలో విక్స్ లేదా యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి తీసుకోండి.
ఇలా ఆవిరి పట్టడం వల్ల సైనస్ క్లియర్ చేయడానికి సహాయపడుతుంది, ఈ పద్ధతి జలుబు నుండి వేగవంతమైన ఉపశమనం ఇస్తుంది.
అల్లం రసం తీసి దానికి తేనె కలిపి వేడి నీటిలో కలిపి తాగుతుంటే గొంతును ఉపశమింపచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
గోరువెచ్చని నీటితో ఉప్పు కలిపి పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, వాపు నుండి ఉపశమనం లభిస్తుంది.
తులసి, పుదీనా ఆకులను మరిగించి తేనె కలపండి. వేడిగా త్రాగాలి.
ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది, జలుబు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని కాల్చి లేదా సూప్లో కలిపి తింటే జలుబు లక్షణాలు తగ్గుతాయి.