వైభవంగా ద్వాదశి చక్రస్నానం
వైకుంఠ ద్వాదశిని పురష్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం తెల్లవారుజూమున తిరుమలలో సుదర్శన చక్రతళ్వార్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉదయం 5గంటల నుంచి 6 గంటల వరకూ జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రోక్తంగా స్వామి వారి సుదర్శన చక్రస్నానం చేయించారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత పుష్కరణిలోని నీటిలో ముంచారు. చక్రస్నానం సందర్భంగా అర్చకులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఈశో సాంబశివరావు, జేఈవో కెఎస్ శ్రీనివాస రాజు, మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు తదితరులు హాజరయ్యారు.
