1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 4 జూన్ 2016 (11:51 IST)

మర్మాంగాలపై పోటీ పెట్టుకున్న ఇద్దరు పురుషులు.. ఆపై ఏమైంది?

ఫుల్‌గా తాగితే మనిషి అదుపులో ఉండరు. ఏం చేస్తారో వారికే తెలీదు. తాగిన మైకంలో ఓ వ్యక్తి చేయకూడని పనిని చేశాడు. అలాంటి ఘటనే రష్యాలో చోటుచేసుకుంది. ఇద్దరు పురుషులు తాగిన తందనాలాడారు. మత్తులో ఉన్న ఆ ఇద్దరు మర్మాంగాల విషయంలో పోటీ పెట్టుకున్నారు. అనంతరం ఓడిపోయిన వ్యక్తి అసూయతో గెలిచిన వ్యక్తి మర్మాంగాన్ని గొడ్డలితో అతిదారుణంగా నరికేశాడు. 
 
ఈ సంఘటన చూసిన అక్కడి వారికి గుండె ఆగినంత పనైంది. చేతిలో మర్మాంగాన్ని, రక్తపు మరకలు, గొడ్డలితో తిరుగుతున్న ఆ వ్యక్తిని చూసి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు గుట్టు బయటపడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. మాస్కోకు సమీపంలోని ఓ గ్రామంలో ఓ 52 ఏళ్ల వ్యక్తి, 47 ఏళ్ల వ్యక్తి తాగుతున్నారు. ఫుల్‌గా తాగాక మత్తు తలకెక్కింది. వినడానికే జుగుప్సకలిగించేలా వింతపోటీ పెట్టుకున్నారు. ఈ పోటీలో 47 ఏళ్ల వ్యక్తి గెలవడంతో 52 ఏళ్ల వ్యక్తికి కోపం కట్టలు తెంచుకుంది. పక్కనే ఉన్న గొడ్డలితో 47 ఏళ్ల వ్యక్తిపై బలంగా కొట్టాడు. 
 
అనంతరం అతడిని కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్లి పురుషాంగాన్ని నరికేశాడు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు రెండు రోజులుగా ఆ ఇద్దరు వ్యక్తులు పూర్తి మద్యంలో మునిగిపోయి ఉండటం వల్ల ఈ గొడవకి దారి తీసిందని వెల్లడించారు. ఈ విషయంపై ఎలా స్పందించాలో తెలీక పోలీసులు జుట్టు పట్టుకుంటున్నారు.