1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (15:13 IST)

హిట్లర్ కట్టించిన ట్రెజర్ హంటర్: 1944 నుంచి నో ఫుడ్.. ఎలుగుబంటి మాంసాన్ని తిని..?

జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కట్టించిన ట్రెజర్ హంటర్ ఒకటి బయటపడింది. ఉత్తర ధ్రువానికి దాదాపు వెయ్యి కిలో మీటర్ల దూరంలో హిట్లర్ ఆదేశాల మేరకు నిర్మించిన ఓ రహస్య స్థావరాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ

జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కట్టించిన ట్రెజర్ హంటర్ ఒకటి బయటపడింది. ఉత్తర ధ్రువానికి దాదాపు వెయ్యి కిలో మీటర్ల దూరంలో హిట్లర్ ఆదేశాల మేరకు నిర్మించిన ఓ రహస్య స్థావరాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని అలెగ్జాండ్రా ల్యాండ్ వద్ద దశాబ్దాల క్రితం ట్రెజర్ హంటర్ పేరుతో వ్యవహరించిన రహస్య ప్రాంతం ఇదేనని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
 
1944లో ఈ ప్రాంతానికి ఆహార సరఫరా నిలిచిపోయింది. దీంతో ఓ విషపూరితమైన ఎలుగుబంటి కళేబర మాంసం తిని సిబ్బంది మృతి చెందినట్లు డెయిలీ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ప్రస్చుచం రష్యా ఆధీనంలో ఉన్న ఈ నిర్మానుష్యమైన దీవిలో దాదాపు 500 వస్తువులు, బంకర్లు, వాడేసిన పెట్రోల్ క్యాన్లు, పేపర్ డాక్యుమెంట్లు లభించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
 
దీనిని 1942లో నేరుగా హిట్లర్‌ ఆదేశాల మేరకే నిర్మించినట్లు భావిస్తున్నారు. తర్వాత ఇది 1943 నుంచి అందుబాటులోకి వచ్చింది. 1944కే ఇక్కడ ఆహార సరఫరా నిలిచిపోయింది. రష్యా పైన దండెత్తడానికి ఏడాది ముందు అంటే 1942లో దీనిని నిర్మించారు.