గురువారం, 19 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 20 మే 2016 (15:47 IST)

ఉద్యోగం ఇస్తానని దుబాయ్‌కు పిలిపించి.. భారతీయ యువతిపై అత్యాచారం!

ఓ యువతిపై పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన పెను దుమారం రేపింది. 
 
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే... రియల్ ఎస్టేట్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్(33)గా పనిచేస్తున్న పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని తనకు ఉద్యోగం కావాలంటూ భారతదేశానికి చెందిన యువతి(19) కలిసింది. దీన్నిఅవకాశంగా తీసుకున్న ఆ కామాంధుడు ఆ యువతిని ఇంటర్వ్యూ కోసం రషీదియా ప్రాంతానికి రావాలని చెప్పాడు.
 
అతని మాటలు నమ్మిన యువతి అక్కడికి చేరుకుంది. అక్కడకు వచ్చిన యువతితో తాను దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీకి చెందిన కంపెనీలో పనిచేస్తున్నానని, ఇంటర్వ్యూ కోసం అక్కడి వెళ్దామని చెప్పి తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతని చెర నుండి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.