శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 29 జులై 2020 (09:31 IST)

పాకిస్తాన్‌లో పిల్లిపై టీనేజర్స్‌ గ్యాంగ్‌రేప్‌

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో అత్యంత కిరాతమైన ఘటన వెలుగుచూసింది. కొంతమంది టీనేజర్స్‌ ఓ పిల్లిపై వారం రోజులపాటు గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డారు.

లాహోర్‌లోని ఓ కుటుంబం ఇటీవల ఓ బుజ్జి పిల్లిని కొనుగోలు చేసింది. ఆ కుటుంబంలోని ఓ మైనర్‌ బాలుడు, అతని ఆరుగురు స్నేహితుల కన్ను దానిపై పడింది. ఈ క్రమంలో అంతా కలిసి ఆ పిల్లిపై వారం రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ పిల్లి మర్మావయవాల నుంచి రక్తం, వీర్యం కారడం మొదలైంది.

కనీసం తిండి కూడా తినలేక, బాధతో విలవిల్లాడుతూ నిద్ర కూడా పోలేక నరకం అనుభవించింది. ఆ పిల్లి పరిస్థితిని గమనించిన ఓ స్థానిక అమ్మాయి దాన్ని తనకు ఇవ్వాలని, తాను చూసుకుంటానని ఆ టీనేజర్స్‌తో చెప్పింది.

ఆ అమ్మాయి దాన్ని లైంగికంగా చిత్రహింసలకు గురిచేసినట్లు గుర్తించింది. దీనిపై జెఎఫ్‌కె జంతు సంరక్షణ సంస్థకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పరిస్థితి విషమించడంతో పిల్లి చనిపోయింది.