గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By pnr

ఐపీఎల్ 2017 : పాయింట్ల పట్టిలకలో ముంబై ఇండియన్ టాప్..

ఐపీఎల్ 2017 టోర్నీలో భాగంగా కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ తాజా విజయంతో ఐపీఎల్ 10 పాయింట్ల పట్టికలో ఆ జట్టు మొదటి స్థానంలో వచ్చి నిలిచింది. ఆదివారం రాత్రి ఈడెన్ గార్డె

ఐపీఎల్ 2017 టోర్నీలో భాగంగా కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ తాజా విజయంతో ఐపీఎల్ 10 పాయింట్ల పట్టికలో ఆ జట్టు మొదటి స్థానంలో వచ్చి నిలిచింది. ఆదివారం రాత్రి ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై పూణె జట్టు విజయం సాధించింది. 
 
వర్షం కారణంగా ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా, కోల్‌కతా జట్టు 164 పరుగులకే పరిమితమైంది. అయినప్పటికీ మెరుగైన రన్ రేటున్న కారణంగా కోల్‌కతా జట్టు 16 పాయింట్లతో ప్లేఆఫ్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. 
 
ముంబై జట్టులో సౌరభ్ తివారీ 52, రాయుడు 63 పరుగులతో రాణించగా, కోల్‌కతా జట్టులో లిన్ 26, గంభీర్ 21, మనీష్ పాండే 33, యూసుఫ్ పఠాన్ 20, గ్రాండ్ హోమ్ 29 పరుగులు చేశారు. ఏ ఆటగాడు కూడా మంచి స్కోరును సాధించడంలో విఫలమైనందునే తాము మ్యాచ్ గెలవలేక పోయామని మ్యాచ్ అనంతరం గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా, క్వాలిఫయర్ రౌండ్‌లో ముంబై జట్టు పూణెతో తలపడనుంది. ముంబై వేదికగా మంగళవారం ఈ మ్యాచ్ జరుగనుంది.