శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (17:55 IST)

మళ్లీ విమర్శిస్తే చంపేస్తా.. ఆర్‌సీబీ అభిమాని హెచ్చరిక..

ఐపీఎల్-12లో రాయల్ ఛాలెంజర్స్‌ పేలవ ప్రదర్శనతో అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. జట్టు వరుస పరాజయాలతో ఆర్‌సీబీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. మరికొందరు అయితే ఏకంగా కెప్టెన్‌ను మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆర్సీబీ ఆటతీరుపై న్యూజిలాండ్‌ బౌలర్‌, ప్రముఖ కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌ విమర్శలు చేసాడు. 
 
తాజాగా ఓ డై హార్డ్ ఆర్సీబీ ఫ్యాన్ ఆ కమెంట్‌లను తట్టుకోలేక ఆర్సీబీని విమర్శిస్తే చంపుతానని హెచ్చరిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసాడు. "ఇతరుల గురించి మాట్లాడే ముందు ఆలోచించాలి. రాయల్ ఛాలెంజర్స్ వారి పరాజయాన్ని అంగీకరించారు. మళ్లీ ఎప్పుడూ అలాంటి కామెంట్స్ చేయకని, కాదని మళ్ళీ విమర్శించావో చచ్చిపోతావు జాగ్రత్త" అంటూ హెచ్చరించాడు.
 
ఆ అభిమాని పోస్ట్‌పై సైమన్‌ డౌల్‌ స్పందించాడు. ‘ఇది ఒక ఆట మాత్రమే. చిల్‌ ఔట్‌ బ్రో’ అంటూ ట్విటర్‌లో సమాధానం ఇచ్చాడు. ఇలా చాలా మంది నుంచి విమర్శలు రావడంతో సైమన్‌ డౌల్‌కు ఆర్సీబీపై చేసిన విమర్శల పోస్టును తొలిగించారు. ప్రస్తుతం బెంగళూరు ఆడిన నాలుగు మ్యాచ్‌లు ఓటమి చెందడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.