శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (13:41 IST)

రిలయన్స్ జియోకు షాక్.. బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లు..

దేశీయ టెలికాం రంగంలో ఏర్పడిన విపరీతమైన పోటీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా సరికొత్తగా మూడు ఆఫర్లను ప్రకటించింది. ఇవి మూడు జియోకు షాకిచ్చేలా ఉన్నాయి. రూ.333 ప్లాన్‌ను తీసు

దేశీయ టెలికాం రంగంలో ఏర్పడిన విపరీతమైన పోటీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా సరికొత్తగా మూడు ఆఫర్లను ప్రకటించింది. ఇవి మూడు జియోకు షాకిచ్చేలా ఉన్నాయి. రూ.333 ప్లాన్‌ను తీసుకొన్న బిఎస్ఎన్‌ఎల్ వినియోగదారులకు ప్రతి రోజూ 3 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. ఇది 90 రోజులవరకు ఈ ఆఫర్ వర్తిస్తోంది. ఈ ఆఫర్‌ను తీసుకొన్న కస్టమర్లకు 270 జీబీ హై వేగంతో 3 జీబీ డేటా అందుతోంది.
 
అలాగే, 'దిత్ కోల్ కే బోల్' పేరుతో రూ.349 ప్లాన్‌ను బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ పథకం కింద ఎస్టీడీతో పాటు లోకల్ కాల్స్‌ను కూడా అపరిమితంగా ఇవ్వనున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 2 జీబీ డేటాను 3జీబీ డేటా స్పీడ్‌తో ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్ రిలయన్స్ జియో ధనాధన్ ఆఫర్ తరహాలోనే ఉంది. ప్రతిరోజూ 1 జీబీ 4 జీబీ డేటాను అందించనుంది. ఈ ఆఫర్ 84 రోజులపాటు ఉంటుంది.
 
చివరగా, రూ.395 ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ 3 వేల నిమిసాలపాటు బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ ఫోన్లకు ఉచితంగా మాట్లాడుకొనే సౌకర్యాన్ని కల్పించింది. మరో వైపు 1800 నిమిషాల పాటు ఇతర నెట్‌వర్క్‌లకు చెందిన కంపెనీల ఫోన్‌లకు ఉచితంగా మాట్లాడుకొనే వెసులుబాటు కల్పించింది. 2 జీబీ డేటాను 3 జీబీ స్పీడ్‌తో అందించనుంది బిఎస్ఎన్‌ఎల్. ఈ పథకం 71 రోజుల వరకు వర్తిస్తోంది.