1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 ఏప్రియల్ 2025 (20:10 IST)

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

woman
అక్రమ సంబంధాలు.. దాని కారణంగా నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్‌లో తరచుగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే, సామాన్యులకు ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అంబేద్కర్ నగరంలో నివాసం ఉంటున్న చంద్రశేఖర్. వీరి భార్య ఇందిరావతికి 50 ఏళ్లు.. ఈ దంపతులకు 2 కొడుకులు, 2 కుమార్తెలు ఉన్నారు. వీరి ఇంటికి పక్కన ఆజాద్ అనే యువకుడు నివసిస్తున్నాడు. అతనికి 30 ఏళ్లు.
 
అయితే, ఇందిరావతి, ఆజాద్‌ల మధ్య ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం  ఇందిరావతి భర్త చంద్రశేఖర్‌కు తెలిసి మందలించాడు. అయితే ఇద్దరూ తమ బంధాన్ని వదులుకోలేరు. దీనితో వేరే మార్గంలో చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కానీ ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారు.
 
పోలీసుల వ‌ర‌కు వ్య‌వ‌హారం వెళ్లడంతో ఇందిరావతి-ఆజాద్‌లు ఇంటి నుంచి పారిపోయి.. ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా భర్తకు ఆహారంలో విషం పెట్టింది.. ఇందిరావతి. కానీ ఈ విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ తన భార్యతో తెగతెంపులు చేసుకున్నాడు.