కోట్లిచ్చినా సరిపోలేదు.. భార్యను వేధించి చంపేసిన మాజీ సెషన్స్ జడ్జి.. ఇదేం బుద్ధి బాబోయ్
వరకట్నం వేధింపులు జడ్జి భార్యకైనా తప్పలేదు. కోట్లాది రూపాయల విలువగల వస్తువులు, నగదును కట్నంగా ఇచ్చినా... ఆ జడ్జికి ఏమాత్రం సరిపోలేదు. మరింత కట్నం కోసం భార్యను వేధించాడు. ఇది సంచలనం సృష్టించిన గీతాంజలి
వరకట్నం వేధింపులు జడ్జి భార్యకైనా తప్పలేదు. కోట్లాది రూపాయల విలువగల వస్తువులు, నగదును కట్నంగా ఇచ్చినా... ఆ జడ్జికి ఏమాత్రం సరిపోలేదు. మరింత కట్నం కోసం భార్యను వేధించాడు. ఇది సంచలనం సృష్టించిన గీతాంజలి 'కట్నం హత్య' కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్లో పేర్కొంది. 2013లో హర్యానా పంచకులకు చెందిన గీతాంజలి అనుమానాస్పదంగా మృతి చెందింది.
జడ్జిగా పనిచేస్తున్న భర్త రణ్వీత్ గార్గ్ క్రూరంగా కట్నం కోసం హింసించడంతోనే గీతాంజలి చనిపోయినట్టు సీబీఐ తన చార్జ్షీట్లో పేర్కొంది. ఈ కేసులో గార్గ్తోపాటు అతని తండ్రి, మాజీ సెషన్స్ జడ్జి కేకే గార్గ్, అతని తల్లి రచన గార్గ్లపై డౌరీ డెత్, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు మోపింది. దీంతో పాటు జడ్జి పోస్ట్ నుంచి సస్పెండైన రణ్వీత్ గార్గ్ ప్రస్తుతం అరెస్ట్ కాగా.. అతని తల్లిదండ్రులు ముందస్తు బెయిల్పై బయట ఉన్నారు.
సీబీఐ చార్జ్షీట్ ప్రకారం.. 2007లో గీతాంజలి-గార్గ్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో గార్గ్కు కట్నం కింద 51 లక్షలు, 101 బంగారు నాణెలు, విలావసంతమైన గృహోపకరాణలు, స్కోడా కారు ఇచ్చారు. 2008లో రూ. 21.6 లక్షలు విలువచేసే మరో స్కోడా సూపర్బ్ కారును కానుకగా ఇచ్చారు. 2011లో గార్గ్ తల్లిదండ్రుల ఒత్తిడితో గీతాంజలి తల్లిదండ్రులు మరో 16.3 లక్షల ప్లాట్ను సోనెపట్లో కొనిచ్చారు.
అయినా, గార్గ్ కట్నం దాహం చల్లారలేదని, పంచకుల సెక్టర్ 25లో రూ. 50 లక్షలు ఇల్లు కొనివ్వాలని నిత్యం గీతాంజలిని వేధించాడని.. ఇలా రోజుకో తరహా వస్తువును కట్నంగా తేవాలని ఆమెను హింసించేవాడని.. పిల్లల ఖర్చులు, ఫీజులు కూడా అమ్మగారింటి నుంచి తేవాల్సిందిగా కేకే గార్గ్ హింసించేవాడని.. అందుకే అతనికి కఠిన శిక్ష పడాలని గీతాంజలి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.