1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (15:27 IST)

ఇత్తడి పాత్రలో వేడినీరు.. పడిపోయిన పాపాయి.. చివరికి ఏమైందంటే?

Hot Water
తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని పెరియపాళయంలో వేడినీటిలో నాలుగేళ్ల పాపాయి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. పెరియపాళయంకు సమీపంలో తిరుక్కండలం తలైయారీ వీధికి చెందిన గజేంద్రన్- కుప్పమ్మాళ్ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె వుంది. కుప్పమ్మ పాపాయి స్నానానికి వేడినీళ్లు తోడింది. 
 
ఎప్పటిలాగానే ఆ రోజు కూడా ఇత్తడి పాత్రలో వేడినీటిని బాత్రూమ్‌లో పెట్టి పొయ్యిని ఆఫ్ చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో బాత్రూమ్‌లోకి వెళ్లిన పాప.. వేడినీటిని వుంచిన ఇత్తడి పాత్రలో పడిపోయింది. దీంతో పాప పెద్దగా అరిచిన శబ్ధం విని పరుగులు పెట్టిన కుప్పమ్మ.. బిడ్డను ఆస్పత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స ఫలించక నాలుగేళ్ల పాప ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాధాన్ని మిగిల్చింది. కళ్లముందే వేడినీటిలో పడి పాపాయి విలవిలలాడిన దృశ్యాలు ఆ తల్లిని షాక్ ఇచ్చాయి. ఇంకా తన బిడ్డ ఇక లేదనే నిజాన్ని కుప్పమ్మ జీర్ణించుకోలేక బోరున విలపించింది.