గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (08:12 IST)

దేహం - మనసు పవిత్రమవుతుందని ఆవు పేడ తిన్న డాక్టర్... ఎక్కడ?

హిందువులు గోవులను పవిత్రంగా పూజిస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు కొందరు గోమూత్రాన్ని సేవిస్తారు. అయితే, ఈ వైద్యుడు మాత్రం ఆవు పేడను ఆరగించాడు. దేహం, మనస్సు పవిత్రమవుతాయని ఈ పని చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయింది. 
 
ఈ వైద్యుడు పేరు డాక్టర్ మనోజ్ మిట్టల్. ఎంబీబీఎస్‌తో పాటు ఎండీ కూడా పూర్తి చేశాడు. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో చిన్నపిల్లల వైద్యుడుగా పని చేస్తున్నాడు. ఈయన ఒక గోశాలలో నిలబడి పంచగవ్యాల విశిష్టతను తెలుపుతూ వీడియోలో కనిపించాడు. 
 
ఆ తర్వాత ఆవుపేడను తీసుకుని ఆరగించాడు. తన తల్లి ఉపవాసం ఉన్న సమయంలో ఆవుపేడను తినేవారని సెలవిచ్చాడు. ఈ వీడియోను వైరల్ హర్యానా అనే వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.