శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (08:32 IST)

ట్రాన్స్‌జెండర్‌తో వివాహం... ఆపై కట్నకానుకలు కావాలంటూ వేధింపులు

హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కట్నకానుకలు కావాలంటూ చిత్ర హింసలు పెట్టాడు అదీ కూడా ఫేస్‌బుక్‌ పరిచయంతో దగ్గరై ఈ పెళ్లి చేసుకున్నాడు. 
 
హైదరాబాద్, ఎల్బీ నగర్‌లో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎల్బీనగర్‌, శివపురికాలనీకి చెందిన ట్రాన్స్‌జండర్‌ (29)కు 2018లో ఏపీ, వెస్ట్‌ గోదావరి జిల్లా, ఏలూరు మం డలం, సత్రంపాడు, ఎంఎస్‌కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ కావలి తారకమహేశ్‌ (24) ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడు. 
 
పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెండ్లి చేసుకుంటానని మహేశ్‌ చె ప్పాడు.. తాను ట్రాన్స్‌ జండర్‌నని ఆమె చెప్పగా.. అయినా పెండ్లి చేసుకుంటానని చెప్పాడు. 
 
ఈ క్రమంలో ఆమె నుంచి రూ.4 లక్షలు తీసుకున్నా డు. అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో ట్రాన్స్‌జండర్‌ను పెండ్లి చేసుకున్నాడు.. కొన్నాళ్ల తర్వాత అదనపు కట్నం కోసం వేధించసాగాడు. 
 
మహేశ్‌.. కుటుంబ సభ్యులు మల్లీశ్వరి, పూజితతో కలిసి ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. వారి వేధింపులు భరించలేక ఆమె తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు వేధింపులకు గురిచేసిన తారక మహేశ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.