1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 జూన్ 2016 (09:01 IST)

యోగ ముద్రలో ప్రపంచం... ఐక్యరాజ్యసమితి వేడుకల్లో 139 దేశాలు

ప్రపంచం యోగ ముద్రలో మునిగిపోయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలు యోగాసనాల్లో నిమగ్నమయ్యారు. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు 139 దేశాలకు చెందిన ప్రజలు యోగసనాలను వేశారు.

ప్రపంచం యోగ ముద్రలో మునిగిపోయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలు యోగాసనాల్లో నిమగ్నమయ్యారు. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు 139 దేశాలకు చెందిన ప్రజలు యోగసనాలను వేశారు. అలాగే, భారత్‌లో యోగా వేడుకలకు చండీగఢ్‌ ప్రధాన వేదిక కానుంది.ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొని యోగాసనాలు వేశారు. చండీగఢ్‌లోని సుప్రసిద్ధ క్యాపిటల్‌ కాంప్లెక్స్‌లో ప్రధాని మోడీ 30 వేల మందితో కలిసి మంగళవారం యోగాసనాలు వేశారు. 
 
ఉదయం 4 గంటల నుంచే వేడుకలు జరిగే ప్రాంగణంలోకి అనుమతించగా, ప్రధాన కార్యక్రమం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. 7 గంటలకు యోగాసనాలు వేయడం ప్రారంభించి 45 నిమిషాలపాటు కొనసాగించారు. ప్రధాన వేడుక జరిగే కాంప్లెక్స్‌ను ఎనిమిది విభాగాలుగా విభజించారు. 500 మంది యోగా శిక్షకులు తమతమ బృందాలతో యోగాసనాలు వేసి చూపిస్తారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉచిత బసు సర్వీసులను మడిపారు. ప్రజలు కూర్చునేందుకు 30 వేల మేడిన్‌ ఇండియా చాపలను సిద్ధం చేశారు. 
 
క్యాపిటల్‌ కాంప్లెక్స్‌లోనే కాదు చండీగఢ్‌వ్యాప్తంగా మరో 100 చోట్ల 10 వేల మందితో యోగా వేడుకలు నిర్వహించారు. ప్రధాని మోడీతో పాటు, పంజాబ్‌ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తదితర ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో 5000 మంది పారామిలటరీ, పోలీసు బలగాలు భారీ సంఖ్యలో మొహరించారు.