బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 12 నవంబరు 2016 (12:36 IST)

గుద్దేయచ్చు రూ.2000 దొంగనోట్లు...? నకిలీరాయుళ్లు చెలరేగిపోతారా?

రూ. 2000 నోటు అలా బయటకు వచ్చిందో లేదో దాని సెక్యూరిటీ ఫీచర్లపై అందరూ మాట్లాడుకున్నారు. కొత్తగా వంకాయ రంగులో విడుదలైన రూ. 2000 నోటుకు అదనపు సెక్యూరిటీ అంశాలు ఏమీ లేవనీ, దాన్ని పోలిన దొంగ నోటును ఎంచక్కా

రూ. 2000 నోటు అలా బయటకు వచ్చిందో లేదో దాని సెక్యూరిటీ ఫీచర్లపై అందరూ మాట్లాడుకున్నారు. కొత్తగా వంకాయ రంగులో విడుదలైన రూ. 2000 నోటుకు అదనపు సెక్యూరిటీ అంశాలు ఏమీ లేవనీ, దాన్ని పోలిన దొంగ నోటును ఎంచక్కా గుద్దేయచ్చనే షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. ఈ నోటులో ఎలాంటి స్పెషల్ ఫీచర్లు లేవని తేలడంతో నకిలీ రాయుళ్లు చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
కాకపోతే ప్రస్తుతం రద్దు చేసిన రూ. 1000, రూ. 500 నోట్లు చెలామణి కాకపోయినా ఒకేసారి రూ. 2000 నోటుతో నకిలీ రాయుళ్లు విజృంభించవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత భద్రతతో కరెన్సీ నోటును వెలికి తీసుకురావాలంటే కేంద్రమంత్రి మండలి ఆమోదంతోపాటుగా కనీసం 5 నుంచి 6 సంవత్సరాలు పాటు కసరత్తు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలియజేస్తున్నారు. ఈ ప్రకారం చూస్తే రూ. 2000 దొంగనోట్లు మళ్లీ ప్రజల్లోకి దావానలంలా వ్యాపించడం మామూలేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ లోపుగా హై సెక్యూరిటీతో రూ. 2000 నోట్లు తీసుకువస్తారో లేదో...?