జేఎన్టీయూలో కండోమ్లు.. అబార్షన్ ఇంజెక్షన్లే కనిపిస్తాయా? : కేంద్రంపై విరుచుకుపడిన కన్హయ్య కుమార్
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యమయ్యాడు. ఈ విషయంలో విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సంచలన విమర్శలు చేశారు. దేశ ద్రోహం ఆరో
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యమయ్యాడు. ఈ విషయంలో విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సంచలన విమర్శలు చేశారు. దేశ ద్రోహం ఆరోపణలపై జైల్లో గడిపివచ్చిన కన్హయ్య కుమార్, "జేఎన్టీయూలో వాడిన కండోములను లెక్కించేంత తెలివితేటలు వారికి ఉన్నాయి. అవే తెలివితేటలను చాలా రోజులుగా అదృశ్యమైన నజీబ్ను కనిపెట్టేందుకు మాత్రం చాలట్లేదు" మంటూ మండిపడ్డారు.
గత ఫిబ్రవరిలో నెలలో ఈ వర్శిటీలో అల్లర్లు చెలరేగిన విషయం తెల్సిందే. ఆ సమయంలో బీజేపీ ప్రతినిధి జ్ఞానదేవ్ అహూజా సందర్శించారు. అపుడు "జేఎన్యూలో రోజూ 3 వేల బీరు క్యాన్లు, 2 వేల మద్యం సీసాలు, 10 వేల సిగరెట్ బడ్స్, 4 వేల బీడీలు, 50 వేల ఎముకల ముక్కలు, 2 వేల ఖాళీ చిప్స్ ప్యాకెట్స్, 3 వేల కండోమ్స్, 500 అబార్షన్ ఇంజక్షన్స్ కనిపిస్తాయి" అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కన్హయ్య కుమార్ మండిపడ్డారు.