1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 26 జనవరి 2019 (11:57 IST)

మోడల్ హత్య కేసు.. కోరిక తీర్చలేదని.. అలా చేశాడట.. ఛార్జీషీట్?

మోడల్ హత్య కేసులో ముంబై పోలీసులు ఛార్జీషీటు దాఖలు చేశారు. కోరిక తీర్చలేదనే కసితో గొంతుకు తాడు బిగించి నిందితుడు చంపేశాడు. ఈ ఘటన గత ఏడాది అక్టోబర్ 15వ తేదీన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గొప్ప మోడల్‌గా ఎదగాలనుకున్న వర్ధమాన మోడల్ మన్సీ దీక్షిత్ (20)ను నిందితుడు సయ్యద్ ముజమ్మిల్ (19) కోరిక తీర్చలేదనే అక్కసుతో హత్య చేశాడు. మోడల్‌తో పరిచయం పెంచుకున్న ఫొటోగ్రాఫర్ ముజమ్మిల్ ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నించాడు. 
 
ఇందులో భాగంగా ఫొటోలు తీసే నెపంతో తన ఇంటికి పిలిచాడు. ఇంటికొచ్చిన ఆమెను తన కోరికను తీర్చాలన్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి లోనైన ఫోటోగ్రాఫర్... స్టూలుతో తలపై కొట్టాడు. ఆపై తాడుతో మెడను బిగించి చంపేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని ఓ సంచిలో మూటకట్టి, క్యాబ్ బుక్ చేసుకుని ఓ ఫుట్ పాత్ వద్ద పడేసి పారిపోయాడు. 
 
కానీ ఆ సంచిలో మృతదేహం వుందని గమనించిన క్యాబ్ డ్రైవర్ ఆ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ముజమ్మిల్‌ను అరెస్ట్ చేశారు. తాను చేసిన నేరాన్ని అంగీకరించడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఛార్జీషీట్ దాఖలు చేశారు.