శనివారం, 1 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2016 (15:02 IST)

ముంబైలో కాలేజీలకు చిరిగిన జీన్స్ వేసుకుని వెళ్ళారో.. కథ అయిపోయినట్లే..!

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో దేశ వాణిజ్య నగరమైన ముంబైలోని కొన్ని కళాశాలలు విద్యార్థినులు ధరించే దుస్తులపై ఆంక్షలు విధించాయి. అయితే ఫ్యాషన్‌పై కాలేజీల యాజమాన్యాలు షరతులు విధించడంపై

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో దేశ వాణిజ్య నగరమైన ముంబైలోని కొన్ని కళాశాలలు విద్యార్థినులు ధరించే దుస్తులపై ఆంక్షలు  విధించాయి. అయితే ఫ్యాషన్‌పై కాలేజీల యాజమాన్యాలు షరతులు విధించడంపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాషన్ పేరుతో కత్తిరించుకున్న జీన్స్, స్లీవ్ లెస్ క్లాత్స్, షార్ట్స్ వేసుకొని అమ్మాయిలు, అబ్బాయిలు కాలేజీ క్యాంపస్‌లోకి రాకూడదని నిబంధనలు విధించాయి.
 
 ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీ, విల్సన్ కాలేజీతో పాటు మరికొన్ని కాలేజీలు ఈ నిర్ణయం తీసుకొన్నాయి. చిరిగిన జీన్స్ ప్యాంటులతో పాటు స్లీవ్ లెస్ దుస్తులను వేసుకునే విద్యార్థులు.. గేట్ బయటనే ఉండాల్సిందేనని.. కొన్ని కాలేజీల్లో అమ్మాయిలకు సమయ నిబంధన కూడ విధించారు. 
 
రాత్రి ఏడు తర్వాత కాలేజ్ క్యాంపస్‌లో అమ్మాయిలు ఉండకూడదని ఆంక్షలు విధించారు. క్యాంపస్ లైబ్రరీ లేదా ల్యాబ్ లలో ఎక్కడ అమ్మాయిలు ఉండకూడదని సూచించారు.ఈ రకమైన నిబంధనల వల్ల తమ స్వేచ్ఛను హరించివేస్తున్నారని విద్యార్థ సంఘాలు మండిపడుతున్నాయి.