పవిత్ర గంగానదికి రాధేమా బూట్లలో రాలేదు... ఉలెన్ సాక్సుల్లో వచ్చారు...
రాధే మా గత నెల హర్కి పౌరి హరిద్వార్కు గంగా నదికి హారతి ఇచ్చేందుకు వచ్చారు. ఐతే ఆమె గంగా నదికి కాలికి బూట్లు వేసుకుని వచ్చారన్న విమర్శలు వచ్చాయి. ఐతే ఈ విమర్శల్లో వాస్తవం లేదనీ, మీడియా దుష్ప్రచారం చేసిందని రాధే మా కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
రాధే మా గత నెల హర్కి పౌరి హరిద్వార్కు గంగా నదికి హారతి ఇచ్చేందుకు వచ్చారు. ఐతే ఆమె గంగా నదికి కాలికి బూట్లు వేసుకుని వచ్చారన్న విమర్శలు వచ్చాయి. ఐతే ఈ విమర్శల్లో వాస్తవం లేదనీ, మీడియా దుష్ప్రచారం చేసిందని రాధే మా కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
పవిత్ర గంగా నదికి వచ్చేటపుడు అనుసరించాల్సిన సంప్రదాయ పద్ధతులను రాధే మా అతిక్రమించలేదని వెల్లడించారు. ఈ మేరకు రాధే మా కుమారుడు భూపేంద్ర సింగ్ సతీమణి శ్రీమతి మెఘా భూపేందర్ సింగ్ ప్రకటన విడుదల చేశారు.
ఈ ప్రకటనలో ఆమె తెలుపుతూ... శ్రీ గంగా సభ, హరిద్వార్ కార్యదర్శి శ్రీ రాంకుమార్ మిశ్రా కూడా రాధే మా గంగా మాతకు పూజలు చేసేందుకు వచ్చినప్పుడు బూట్లు ధరించలేదని ధృవీకరించారు. రాధే మా గంగా మాతకు పూజలు చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా వీక్షించినవారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు, స్వీపర్స్, పోలీసులు కూడా రాధే మా ఆ సమయంలో ఉలెన్ సాక్సులు ధరించి గంగా మాతకు పూజలు నిర్వహించినట్లు వెల్లడించారని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను తగ్గట్లుగానే ఎప్పటికీ రాధే మా నడుచుకుంటారని తెలిపారు.