సీనియర్ విద్యార్థుల దారుణం.. జూనియర్లను ఇనుప రాడ్లతో దాడి చేశారు!
నోయిడాలో దారుణం జరిగింది. ర్యాంగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీంతో ఇద్దరు విద్యార్థుల తీవ్రంగా గాయపడ్డారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు చెందిన కొంతమంది 12వ తరగతి విద్యార్థులు అదే స్కూల్లో చదివే విద్యార్థులు 11వ తరగతి చదివే విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో ఇనుప రాడ్డుతో కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడగా, వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన చోటుచేసుకోగా, 18 మంది డిపిఎస్ నోయిడా విద్యార్థులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 12వ తరగతి విద్యార్థులు హాస్టల్లో తమ పిల్లలను ర్యాంగింగ్ చేసి, దాడికి దిగినట్టు గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
దీనిపై బాధిత విద్యార్థి ఒకరు మాట్లాడుతూ.. కొంతమంది సీనియర్ విద్యార్థులు తరచు తమను వేధిస్తుండేవారని, తమ ఆహారం లాక్కునేవారని, సీల్డ్ ప్యాకెట్లలో వారికి ఆహారం తెచ్చి ఇవ్వకుంటే దానిని తమ ముఖాలపైకి విసిరికొట్టి అవమానించేవారని చెప్పాడు.
కాగా, ఈ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం కాలేజీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 'ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులు నా కుమారుడిపై రాడ్లతో దాడి చేశారు. ఆ తర్వాత నా కుమారుడి పరిస్థితి ఎలాగో ఉందో కూడా సమాచారం ఇవ్వలేదు' అని ఆయన వాపోయారు. కేవలం 15 రోజుల క్రితమే తన కుమారుడు స్కూలుకు వచ్చినట్టు తెలిపారు.