ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2023 (12:08 IST)

2024 ఎన్నికలు: రెండవ దశ జోడో యాత్రను రాహుల్ ప్రారంభిస్తారా?

Rahul Gandhi Jodo Yatra
2024 ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీజేపీ తర్వాత కాంగ్రెస్ 2024కి సిద్ధమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాజకీయాలపై చర్చ జరిగింది. 
 
ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. విపక్షాల గైర్హాజరీలో ముఖ్యమైన బిల్లులన్నింటినీ ఆమోదించడం ద్వారా మోదీ ప్రభుత్వం పార్లమెంటు గౌరవానికి భంగం కలిగిస్తోందన్నారు. 
 
నేడు రాజ్యాంగం, పార్లమెంటు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశభక్తి అనేది మన రక్తంలో, డీఎన్‌ఏలో ఉందని ఖర్గే ప్రసంగించారు. బ్రిటిష్ పాలనలో కూడా మన పూర్వీకులు భయపడి నమస్కరించడం నేర్చుకోలేదు. 
 
మల్లికార్జున్ ఖర్గే సిడబ్ల్యుసిలో మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండో దశ భారత్ జోడో యాత్రను ప్రారంభించాలని కోరుతున్నారు. జనవరి మధ్యలో, రాహుల్ గాంధీ తూర్పు నుండి పశ్చిమ భారతదేశం నుండి రెండవ దశ జోడో యాత్రను ప్రారంభించవచ్చని తెలుస్తోంది.