శుక్రవారం, 27 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2016 (16:14 IST)

సెల్ఫీ మోజు…తుపాకీతో ప్రాణం మీదికి తెచ్చుకున్న మహిళ

ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీలపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సెల్ఫీ మోజులో పడి ఈనాటి యువత దగ్గర నుండి పండు ముసలి వరకు తమను తాము మర్చిపోతుంటారు. తాము చేస్తున్న పనిని వదిలి మరి సెల్ఫీలు దిగుతారు. సెల్ఫీ మోజు

ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీలపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సెల్ఫీ మోజులో పడి ఈనాటి యువత దగ్గర నుండి పండు ముసలి వరకు తమను తాము మర్చిపోతుంటారు. తాము చేస్తున్న పనిని వదిలి మరి సెల్ఫీలు దిగుతారు. సెల్ఫీ మోజులో పడి తమ ప్రాణాలను సైతం పోగుట్టుకుంటున్నారు.
 
ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు అన్ని ఎన్ని కావు. తాజాగా... తుపాకీతో సెల్ఫీ తీసుకోవాలనుకుని ఆశపడి ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... ఆలెం టౌనుకు చెందిన మిను అనే మహిళ తన దగ్గర ఉన్న లైసెన్స్‌డ్‌ తుపాకీతో సెల్ఫీ దిగాలని ముచ్చటపడింది. 
 
అయితే అనుకోని విధంగా సెల్ఫీ దిగుతుండగా శరీరంలో బుల్లెట్‌ దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.