1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (07:02 IST)

హనుమాన్ గుడికి విలువైన ముస్లిం స్థలం దానం

మతాల పేరుతో రచ్చ చేసే కొందరికి కువిప్పు కలిగించేలా చేశారు ఒక ముస్లిం వ్యక్తి. వ్యాపారి అయిన సదరు ముస్లిం హిందువుల దేవుడైన హనుమంతుడి ఆలయం కోసం ఖరీదైన స్థలాన్ని విరాళంగా ఇచ్చాడు.

వివరాల్లోకి వెళ్తే... బెంగళూరులో లారీ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్న హెచ్ఎంజీ బాషా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. వలగెరెపుర గ్రామంలోని హనుమాన్ దేవాలయం పక్కనే ఆయనకు కొంత భూము ఉంది.

అయితే గుడి చిన్నగా ఉండడంతో భక్తులు ప్రదక్షిణలు చేయడానికి వీలు కావడం లేదు. గుడిని పరిశీలించిన బాషా గుడి పక్కనే ఉన్న తన 180 గజాల స్థలాన్ని ఇస్తానని చెప్పి మతసామరస్యాన్ని చాటుకున్నాడు.

తన స్థలం పక్కనే ఆలయం ఉండడం వలన ఇలా చేయగలిగానని ఆయన పేర్కొన్నారు. మొదట ఆ ఊరి వాలు ఆయన మాటలు నమ్మలేకపోయారు. బాషా కాగితాలు కూడా రెడీ చేయించడంతో ఆయనకు వారంతా ధన్యవాదాలు తెలిపారు.

బాషా గుడికోసం ఇచ్చిన స్థలం ఖరీదు 80 లక్షల రూపాయలు. ఆయన నిర్ణయాన్ని కొనియాడుతూ వలెగెరెపుర గ్రామస్తులు గుడి పక్కనే ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో బాషా, ఆయన భార్య కూడా ఉన్నారు.