ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (16:28 IST)

పెళ్లికి వెళ్ళి తిరిగొస్తున్న బాలికపై సామూహిక అత్యాచారం.. రాత్రంతా కొట్టి.. ఆమెను..?

దేశంలో అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహ వేడ‌ుక‌కు హాజ‌రై ఇంటికి తిరిగి వ‌స్తున్న ఓ బాలికను స‌మీప అట‌వీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లి ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. రాత్రంతా బాలిక‌ను బంధించే ఉంచిన నిందితులు తెల్ల‌వారుజామున వ‌దిలేశారు. ఆ త‌ర్వాత ఇంటికి వ‌చ్చిన బాధితురాలు అవ‌మానాన్ని భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. గ‌త జూలైలో కొండ‌గావ్ జిల్లాలోని ఓ గ్రామంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. గ‌త జూలైలో బాధిత బాలిక స్నేహితుడితో క‌లిసి ఓ పెళ్లికి వెళ్లింది. పెళ్లి నుంచి తిరిగి వ‌స్తుండ‌గా అడ్డగించిన ఇద్ద‌రు వ్య‌క్తులు బాలిక స్నేహితుడిని తీవ్రంగా కొట్టి ఆమెను అట‌వీ ప్రాంతంలోకి లాక్కెళ్లారు. అక్కడ మరో ఐదుగురు చేరారు. మొత్తం ఏడుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా బాలిక‌తోనే గ‌డిపిన నిందితులు తెల్ల‌వారుజామున ఆమెను వ‌దిలేశారు. అవ‌మానభారంతో కుంగిపోయిన ఆమె ఇంటికి చేరుకోగానే ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.  
 
బాధితురాలి స్నేహితుడు ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఆమె కుటుంబ‌ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్ల‌క్ష్యంగా మాట్లాడ‌టంతో ఏం చేయాలో తోచ‌క మృత‌దేహాన్ని ఖ‌న‌నం చేశారు. కానీ ఆమె తల్లిదండ్రులు నిందితులకు తగిన శిక్ష విధించాలని ఆందోళనకు దిగారు. దీంతో త‌న కూతురుకు న్యాయం జ‌రుగ‌లేద‌ని క‌ల‌త‌చెందాడు. మ‌నోవేద‌న భ‌రించ‌లేక‌ అక్టోబ‌ర్ 6న ఆత్మ‌హ‌త్యాయత్నం చేశాడు. అనంతరం పోలీసులు ఐదుగురు నిందితుల‌ను అరెస్ట్ చేసి, ప‌రారీలో ఉన్న మ‌రో ఇద్ద‌రి కోసం గాలిస్తున్నారు. 
 
బాలిక మృత‌దేహాన్ని వెలికి తీయించి పోస్ట్‌మార్టానికి త‌ర‌లించారు. అయితే ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌న్న బాధిత కుంటుంబం ఆరోప‌ణ‌ల‌ను పోలీసులు ఖండించారు. ఈ విష‌యమై గ‌తంలో త‌మ‌కు ఎలాంటి ఫిర్యాదు అంద‌లేద‌ని ఖాకీలు బుకాయిస్తున్నారు.