ఆదివారం, 9 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (22:34 IST)

ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలను చూస్తే తెలుస్తుంది... పవన్‌పై వెంకయ్య పరోక్ష వ్యాఖ్య

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలపై ఇపుడే స్పందినని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చాలామంది నినాదాలు చేస్తున్నారనీ, ఐతే అసలు ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు వెళ్లి

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలపై ఇపుడే స్పందినని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చాలామంది నినాదాలు చేస్తున్నారనీ, ఐతే అసలు ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు వెళ్లి చూస్తే అక్కడి ఆ రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనం కలిగిందో చూడవచ్చని అన్నారు. తాము ప్రత్యేక హోదా కంటే మించిన సాయం ఏపీకి చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. 
 
శుక్రవారం నాడు ప్రెస్ ఇన్ఫరేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో చెన్నైలో రెండో రోజు జరిగిన ప్రాంతీయ సంపాదకుల సదస్సులో మాట్లాడారు. తిరంగ యాత్ర వీడియోను విడుదల చేసిన అనంతరం తెలుగు మీడియా సంపాదకులతో మాట్లాడారు. అభివృద్ధికి రహదారులు ముఖ్యమనీ, అందువల్ల రహదారులకు అడ్డంగా ఉండే ఆలయాలను పడగొట్టి, అడ్డంకులు లేకుండా విస్తరించాల్సి ఉందన్నారు.