1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 మార్చి 2022 (21:12 IST)

బీర్బూమ్‌లో 12 మంది సజీవదహనం.. ఎలా జరిగింది?

పశ్చిమ బెంగాల్‌లో బీర్బూమ్ జిల్లాలోని ఇళ్లకు నిప్పు పెట్టడంతో 12 మంది సజీవ దహనమయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులున్నట్లు సమాచారం. రాజకీయ కక్షల కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని వార్తలు వస్తున్నాయి. 
 
తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి హత్యకు ప్రతీకారంగా వారి ఇళ్లకు నిప్పు పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. సోమవారం గత రాత్రి సుమారు 10-12 ఇళ్లకు నిప్పు పెట్టారు. మంటల్లో కాలిపోయి 12 మంది చనిపోగా.. మరో 38 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో 40 ఇళ్లు దగ్ధమవ్వగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
 
అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీర్‌భూమ్‌లో జరిగిన రాజకీయ హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారు.
 
ఈ విషయంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ.. 'రాంపూర్‌హాట్‌లో అగ్నిప్రమాదానికి రాజకీయాలకు సంబంధం లేదని కొట్టిపారేశారు.