1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 మే 2025 (19:52 IST)

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

death
తెలంగాణలో వడదెబ్బ కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణ, ఆదిలాబాద్ న్యూ కాలనీలోని ఒక మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయిన షేక్ అమన్ అనే యువకుడు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. 
మంగళవారం బోత్ మండల కేంద్రంలోని న్యూ కాలనీలో క్రికెట్ ఆడుతూ 18 ఏళ్ల బాలుడు వడదెబ్బతో మరణించాడు.
 
షేక్ అమన్ వరుసగా మూడో రోజు కూడా మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడని స్థానికులు తెలిపారు. అతనికి వాంతులు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను తుది శ్వాస విడిచాడు. అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.