1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: సోమవారం, 31 ఆగస్టు 2020 (12:34 IST)

వార్నింగ్ ఇద్దామని వెళితే స్నేహితుడితో కలిసి రేప్ చేసిన ప్రియుడు

గాఢంగా ప్రేమించానన్నాడు. దీంతో ఆమె నమ్మింది. అయితే ప్రేమతో పాటు శారీరక సంబంధం పెట్టుకున్నామన్నారు. అందుకే ఒప్పుకోలేదు. వారంరోజుల నుంచి అతని నుంచి ఒత్తిడి ఎక్కువైంది. అయినా ఆ యువతి ఒప్పుకోలేదు. దీంతో ప్రియుడు తన స్నేహితుడితో కలిసి ప్రియురాలిపై అత్యాచారం చేశాడు.
 
తెలంగాణా రాష్ట్రం యాదాద్రి జిల్లాలోని మోటకొండూరు మండలం కాటేపల్లికి గ్రామానికి చెందిన రవి అదే ప్రాంతానికి చెందని ఒక యువతి సంవత్సరంగా ప్రేమించుకుంటున్నారు. రవిపై గాఢంగా ప్రేమిస్తున్నాడని నమ్మింది యువతి.
 
అతను ఎక్కడికి పిలిస్తే అక్కడకు వచ్చేది. అయితే ఎలాగో పెళ్ళి చేసుకుందాం కదా శారీరకంగా కలుద్దామని వారం రోజుల నుంచి ప్రియురాలిని ఒలవంతం చేయడం ప్రారంభించాడు రవి. అందుకే ఆమె ఒప్పుకోలేదు. ఇంటికి వెళ్ళినా ఫోన్లు చేస్తూనే ఉండేవాడు.
 
దీంతో  నిన్న మధ్యాహ్నం ప్రియుడికి వార్నింగ్ ఇద్దామని వెళ్ళింది ప్రియురాలు. అయితే తన స్నేహితుడు తేజతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం చేశాడు రవి. ఆ తరువాత ఆమెను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు.